నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గురువారం16వ విడత సామాజిక ప్రజావేదిక కార్యక్రమానికి ముఖ్యదితీగా హాజరైన భూపాలపల్లి జిల్లా డిఆర్డీఓ బాలకృష్ణకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. మండలంలో జరుగుతున్న ఉపాధిహామీ పనుల్లో భాగంగా కూలీలకు సకాలంలో వేతనాలు, జాబ్ కార్డులు, పనిముట్లు, ప్రథమ చికిత్స కిట్లు కూలీలకు అందేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డీవోను ఈ సందర్భంగా రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,డిఆర్ఓ రూబినా, ఎంపిడిఓ శ్రీనివాస్, అంబర్స్ పర్సన్ శ్రీనివాస్,క్యూసి దరంసింగ్,ఎస్ఆర్పీ వెంకన్న,ఎపిఓ హరీష్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాది టెక్నికల్ అసిస్టెంట్లు, పిల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
డిఆర్డీఓ బాలకృష్ణకు సన్మానం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES