Sunday, January 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయిలో ఇద్దరు విద్యార్థులకు బంగారు పతకాలు

రాష్ట్రస్థాయిలో ఇద్దరు విద్యార్థులకు బంగారు పతకాలు

- Advertisement -

– జనగామ గ్రామానికి గర్వకారణం
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా, బీబీపేట మండలంలోని జనగామ గ్రామానికి చెందిన విద్యార్థులు డాకురు నిక్షిత, కుమ్మరి ధనుష్ కుమార్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన తెలంగాణ స్టేట్ కరాటే  సెలక్షన్స్‌లో ప్రతిభ కనబర్చి బంగారు పతకాలు సాధించారు. ఈ విజయంతో వారు వచ్చే ఏప్రిల్ నెలలో ముంబైలో జరగనున్న నేషనల్ లెవెల్ పోటీలకు ఎంపికయ్యారని గ్రాండ్ మాస్టర్ కామిండ్ల  రాజయ్య తెలిపారు. విద్యార్థుల ఈ ఘన విజయంలో కోచ్‌లు కేకే స్వామి, కోచ్ చింటూ వారి శిక్షణ కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. జనగామ గ్రామం పేరు రాష్ట్రస్థాయిలో వెలుగొందేలా చేసిన విద్యార్థులను గ్రామస్తులు, క్రీడాభిమానులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -