- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయడంలో భాగంగా మహిళా సంఘాల ద్వారా కుట్టినటువంటి స్కూల్ యూనిఫామ్స్ లను గురువారం ఎంఈఓ రాజా గంగారెడ్డి విద్యార్థులకు అందజేశారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాల ప్రారంభ సమయం వరకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టిన మహిళా సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెర్ఫ్ ప్రాజెక్టు మేనేజర్ భీమయ్య, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ కరుణాకర్, ఏపీడి మురళీకృష్ణ, ఏపీఎం శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మహిళా సంఘం సభ్యులు, వివో ఏలు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -