- Advertisement -
– హాజరు కానున్న డీపీఈఓ దానయ్య
– సీఐ సాంబమూర్తి వెల్లడి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎక్సైజ్ తనిఖీల్లో పట్టుబడిన 5 ద్విచక్రవాహనాలు, 1 కారు ఈ 27 వ తేదిన వేలం వేయనున్నట్లు స్థానిక ఎక్సైజ్ సీఐ సాంబమూర్తి గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్. దానయ్య హాజరు అవుతారని అన్నారు. ఆసక్తి ఉన్న వారు స్థానిక కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు.
- Advertisement -


