- Advertisement -
కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి: జిల్లాలో గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గ్రామ పాలన అధికారుల స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ పరీక్షలో 401 మంది అభ్యర్థులకు గాను 377 మంది హాజరయ్యారని, 24 మంది ఆబ్సెంట్ అయ్యారని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూద్ అహ్మద్ తదితరులు ఉన్నారు.
- Advertisement -