- Advertisement -
నవతెలంగాణ -భిక్కనూర్: మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారి పక్కన ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సహాకారంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు సోమవారం బస్టాండ్ నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, బిజెపి నాయకులు మాట్లాడుతూ.. బస్టాండ్ సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి బస్టాండ్ నిర్మాణానికి కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు, బిజెపి నాయకులు, విద్యార్థులు,కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -