నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎస్పీ మహేష్ బి. గీతే మాట్లాడుతూ… ఈవినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారని, జిల్లా పరిదిలో ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా జిల్లా పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల నిర్వాహకులు, యువత జాగ్రత్తలు తీసుకోవడం కనిపించిందని, ఇదేరీతిలో నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ లకు సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు ఎస్పీ తెలిపారు.
అనంతరం పోలీస్ పోలీస్ కార్యాలయంలో గత ఏడూ రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని శోభయాత్రను ఎస్పీ ప్రారంబించగా గణపతి దేవుని ప్రతిమను డప్పు వాయిద్యాలతో, పోలీస్ అధికారులు సిబ్బంది, పిల్లలు, మహిళల కోలాటం ఆట పాటలతో అందరు ఆనందోత్సవ నృత్యాలతో కోలాహలం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి మానేరు నదిలో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య,సి.ఐ లు , ఆర్ఐలు, ఎస్.ఐ లు, కార్యాలయ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.