ఫుట్బాల్ అభిమానుల సంబురాల్లో ఘర్షణ..
ఇద్దరు మృతి.. 200మందికి పైగా గాయాలు
పారిస్ : ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీయడంతో ఆదివారం పారిస్ వీధులు హింసాత్మకంగా మారాయి. ఈ హింసా కాండలో ఇద్దరు మరణించగా, 21మంది పోలీస్ అధికారులు సహా 200 మంది గాయపడ్డారని పోలీసులన్నారు. పారిస్లో సుమారు 491మందిని అరెస్ట్ చేయ గా, ఫ్రాన్స్ వ్యాప్తంగా మొత్తం 559 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఏం జరిగింది..?
ఛాంపియన్స్ లీగ్ ఫైనల్లో పారిస్ సెయింట్- జర్మైన్ (పీఎస్జీ) జట్టు, ఇంటర్ మిలన్ జట్టుపై 5-0 స్కోరుతో విజయం సాధించింది. బిగ్స్క్రీన్స్తో పాటు ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ను చూసేందుకు సుమారు యాభైవేల మంది అభిమానులు పారిస్లోని చాంప్స్ -ఎలిసీస్ అవెన్యూ, పీఎస్జీకి చెందిన పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియానికి చేరుకున్నారు. పీఎస్జీ విజయం సాధించడంతో అభిమానులు పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. ఇదే సమయంలో ఇంటర్ మిలన్ జట్టు అభిమానుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలు హింసాకాండకు దారితీశాయని అధికారులు తెలిపారు.
పారిస్ వీధుల్లో మొదలైన వేడుకలు హింసాత్మకంగా మారడంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్ప వాయువు ప్రయోగించారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు భద్రతా దళాలపై దాడులకు దిగారు. బస్షెల్టర్లను ధ్వంసం చేయడంతో పాటు 200కి పైగా వాహనాలకు నిప్పుపెట్టారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది.
ఫ్రాన్స్లో హింసాకాండ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES