ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కళాశాలలపై చర్యలు
ప్రభుత్వ కళాశాలలోనే ఉత్తీర్ణశాతం అధికం
విద్యార్థులలో చదువుపై తపన ఉండాలి
ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా అధికారి రమణీ
నవతెలంగాణ – భువనగిరి
జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా బలోపేతం చేస్తున్నామని ఇంటర్మీడియట్ బోర్డ్ జిల్లా అధికారి రమణి తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేటు కళాశాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్య వికాసంపై నవ తెలంగాణ తీసుకు వస్తున్న ప్రత్యేక సంచిక సందర్భంగా ఆమె పలు విషయాలను ప్రస్తావించారు.
ప్రశ్న : జిల్లాలో ఉన్న కళాశాలలు ఎన్ని?
జవాబు: జిల్లాలో మొత్తము 68 ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నాయి. అందులో 11 ప్రభుత్వ కళాశాలలో 33 సెమీ సెక్టర్ కళాశాలలు, 24 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి.
ప్రశ్న: ప్రభుత్వ కళాశాలలో ఎలా బలోపేతం చేస్తున్నారు?
జవాబు: ప్రభుత్వ కళాశాల బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. బోధనలో అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. మంచినీటి వసతి, బాత్రూంలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. బ్లాక్ బోర్డులు, చాక్ పీస్ ల ఖర్చులకోసం ఇప్పటికే ప్రభుత్వం రూ. 10వేలు అందజేసింది. అన్నారు. ఆలేరు జూనియర్ కళాశాల మినహా, అన్ని కళాశాలకు భవనాలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ఆలేరు జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉందన్న విషయము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. లెక్చలేర్స్ ఇంటింటికి వెళ్లి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2000 మంది నూతన విద్యార్థులు చేరే విధంగా కృషి చేస్తున్నామన్నాము.
ప్రశ్న: కళాశాలలో రిజల్ట్ ఎలా ఉంది?
జవాబు: గత సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో 29వ స్థానం ఉంటే, ఈ సంవత్సరం 14వ స్థానంలో ఉన్నామన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్లో 5 వ స్థానంలో ఉండడానికి ముందస్తు ప్రణాళిక రూపొందించామన్నారు. అందులో భాగంగా మూడు నెలల ప్రత్యేక ప్రణాళిక తయారుచేసి ముందుకు సాగుతున్నామన్నారు. అత్యత్తమ ఫలితాల కోసం ప్రిన్సిపాల్ స్టాప్ తో జూమ్ మీటింగ్లు 15 రోజులు ఒకసారి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతినెల ప్రిన్సిపాల్ తో జిల్లా కలెక్టర్ నేరుగా మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 27న ప్రధానోపాధ్యాయులు తో వెల్ఫేర్ ఆఫీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. మోత్కూర్ జూనియర్ కళాశాల 100%, భువనగిరి విద్యార్థుల జూనియర్ కళాశాలలో 98 అత్యుత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రశ్న: ప్రభుత్వ కళాశాలలో ఉన్న ఖాళీలు?
జవాబు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ చెందిన ఆరుగురు అధ్యాపకులు , 15 మంది ఒకేషనల్ అధ్యాపకుల కొరత ఉందన్నారు. ఆ సబ్జెక్టులు సంబంధించిన అధ్యాపకులను నియమించడానికి కృషి చేస్తున్నామన్నారు. బొమ్మలరామారం, భువనగిరి జూనియర్ కళాశాలలో పి ఈ డి లు ఉన్నట్లు తెలిపారు.
ప్రశ్న: విద్యార్థులకు మీరిచ్చే సందేశం?
జవాబు: కళాశాలలో చదివే విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తపన ఉండాలని తెలిపారు. రవాణా సౌకర్యం లేదని కారణంతో కళాశాలకు ఆలస్యంగా రావద్దు అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో పాటు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న విద్యార్థులు వినియోగించుకోవాలి. ప్రభుత్వం కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తుందని దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. విశాలమైన మైదానాలు, ల్యాబ్ లు, గ్రంథాలయాలు ఉన్నట్లు తెలిపారు, కళాశాలకు విద్యార్థులు సకాలంలో రావాలి. కళాశాలకు వస్తున్నామని చెప్తూ తల్లిదండ్రులకు తెలియకడా కళాశాల బయట తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉంటుందని విద్యార్థులు గ్రహించాలన్నారు.