Monday, June 30, 2025
E-PAPER
Homeనిజామాబాద్మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలి

మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలి

- Advertisement -

నవతెలంగాణ-హాలియా

– సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

 దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం హాలియాలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సిపిఎం నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభ ఉపన్యాసం చేసి ఆయన మాట్లాడారు. దేశంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా దారదత్వం చేస్తుందని అన్నారు. రైతులకు మన చట్టాలు తీసుకొచ్చి దొడ్డిదారి నఅమలు చేసే కుట్రలు చేస్తున్నారన్నారు. కార్మికులకు నాలుగు లేబర్ కోడ్ ల ను తీసుకొచ్చి కార్మికుల జీవితాలను నడిరోడ్డుకు తీసుకొచ్చిందని అన్నారు. కార్మికులు ఎనిమిది గంటల పని విధానానికి బదులుగా 12 గంటల పని విధానం అమలు చేయడానికి పూనుకుంటుందని దీనిని కార్మికులంతా వ్యతిరేకించాలని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వాన్ని చూస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రాల్లో రేవంత్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలను కచ్చితంగా అమలు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో, నిర్మాణంలో రాజకీయ జోక్యం నివారించి,లబ్ధిదారులకు ఇందులో చెల్లింపులు అవినీతి అక్రమంలో చోటు లేకుండా చూడాలని ఆయన కోరారు. అనంతరం నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులలో *మతం మతతత్వం అనే క్లాసును, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ *పిట్టల రవి, పార్టీ నిర్మాణం,పని పద్ధతులు,శాఖల నిర్మాణం అనే క్లాస్ ను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ పార్టీ సభ్యులకు క్లాస్ లను బోధించారు. క్లాసుల లో *ప్రిన్సిపాల్ గా కొండేటి శ్రీను, మండల కార్యదర్శిలు అవుతా సైదయ్య, దైద శ్రీను, కందుకూరి కోటేష్, దుబ్బారాం చంద్రయ్య, జటావత్ రవి నాయక్, కత్తి లింగారెడ్డి, ఎస్ కే బషీర్, నల్లబోతు సోమయ్య, కొప్పు వెంకన్న, వేములకొండ పుల్లయ్య, మల్లికంటి చంద్రశేఖర్, కారంపూడి ధనమ్మ, కోరే రమేష్, యశోద, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -