మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య
నవతెలంగాణ – పెద్దవంగర : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని వడ్డెకొత్తపల్లి, పోచారం, బొత్తల తండా, బొమ్మకల్, ఆర్సీ తండా, రెడ్డికుంట తండా, కాండ్య తండా, కొరిపల్లి, మోత్య తండా, టీక్యా తండా గ్రామాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చించాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. నియోజకవర్గంలో తన ఎమ్మెల్యే జీతం అభివృద్ధి కోసం ఖర్చు పెడుతా అని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చినాక ఎక్కడ తన జీతం ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెళ్లి కానుకగా ఇస్తామన్న తులం బంగారం ఎటు పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, దుంపల సమ్మయ్య, రాసాల సమ్మయ్య, పసులేటి వెంకట్రామయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు కేశబోయిన కుమారస్వామి, రెడ్డబోయిన గంగాధర్, ఆరుట్ల వెంకట్ రెడ్డి, కూకట్ల వీరన్న, భూక్యా శ్రీను, మాజీ ఎంపీటీసీలు ఎర్ర వెంకన్న, మాజీ సర్పంచ్లు దంతాలపల్లి సాయిలు, నూనావత్ లక్ష్మి బాలు నాయక్, ధరావత్ బీమా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES