మహిళ బూత్ కమిటీలు నియామకం.!
కాంగ్రెస్ పార్టీ మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కనగర్తి కుమారి
ప్రధాన కార్యదర్శి శోభారాణి
నవతెలంగాణ – మల్హార్ రావు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందేలా ప్రజల్లోకి తీసుకెళ్ళుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త తనవంతుగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కనగర్తి కుమారి,ప్రధాన కార్యదర్శి శోభారాణి తెలిపారు. బుధవారం మండలంలోని కొయ్యుర్ లో కాంగ్రెస్ పార్టీ మహిళ మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మండలంలోని 46 పోలింగ్ కేంద్రాల బూత్ కమిటీలు నియామకం చేసి పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి,కాటారం మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పంథకానీ తిరుమల,కాటారం మహిళ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి,మండల కార్యదర్శి రజిత,కొయ్యుర్ మాజీ ఉప సర్పంచ్ కొండూరు మమత పాల్గొన్నారు.