Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూపాలపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం ..

భూపాలపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం ..

- Advertisement -

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 
నవతెలంగాణ – భూపాలపల్లి
: తెలంగాణ రాష్ట్రంలోనే భూపాలపల్లిని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సుభాష్ కాలనీ, సింగరేణి కమ్యూనిటి హాలులో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉత్తర్వులు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆర్ అండ్ బి ద్వారా 120 కొట్లతో రహదారి పనులు,  కమ్యూనిటి హాల్స్ ఇచ్చామని, 5 కోట్లతో చెల్పూర్ వద్ద బస్ స్టాండ్, అన్ని రోడ్లను బిటి రోడ్లుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గణపురం వద్ద 40 ఎకరాలలో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు.  దరణి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, దరణిని రద్దు చేసి నిరుపేదలకు అందుబాటులోకి భూ భారతి చట్టం తెచ్చామని తెలిపారు.  మంగళవారం నుండి జరుగనున్న భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు తమ దరఖాస్తులు ఇవ్వాలని తెలిపారు.  వర్గీకరణ 30 సంవత్సరాలు నుండి జరుగుతుందని, సుప్రీంకోర్టు తీర్మానాన్ని అమలు చేయడానికి ఏ,బి,సి,డి వర్గీకరణ చేసినట్లు తెలిపారు. బిసి వర్గాలకు  48 శాతం రిజర్వేషన్స్ కల్పించనున్న ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని అన్నారు.

భూపాలపల్లి నియోజకవర్గానికి 3046 ఇందిరమ్మ ఇండ్లు, సాయంపేట మండలానికి 454 ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు.  భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, గోరి కొత్తపల్లి, టేకుమట్ల, మొగుళ్ల పల్లి మండలాల్లోని 211 మహిళా సంఘాలకు 16.50 కోట్లు, మున్సిపల్ పరిధిలోని 12 సంఘాలకు 2 కోట్లు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు.  ఈ నిధులతో వ్యాపారాలు నిర్వహించి మహిళలు పారిశ్రామిక వేతలుగా ఎదగాలని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడించిందని ఈ కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సన్నర కాలంలో దాదాపు 58 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. 4వేల కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరికి ఆరు కిలోలు ఉచితంగా చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని పేదోళ్ళు కడుపునిండా అన్నం తింటున్నారని అన్నారు. డిబియం 38 ద్వారా బీడు భూములను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత  ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. 14 కోట్లతో ప్రభుత్వ ప్రధాన వైద్య శాలలకు మూడవ అంతస్థు, అలాగే 203 వైద్యులు, సిబ్బంది పోస్టులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని, మీ నమ్మకాన్ని వమ్ము చేయక నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.  ముఖ్యంగా ఇందిర మహిళ శక్తి, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, ఆర్టిసి బస్సులు, మహిళల  స్కూల్ యూనిఫాం కుట్టే పనులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి  అభివృద్ధి పనులు చేపట్టిన తెలిపారు.   నిరుపేదలను ప్రామాణికంగా తీసుకొని పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు పారదర్శకంగా  జరిగినట్లు తెలిపారు.  అర్హుల జాబితాను గెజిటెడ్ అధికారుల ద్వారా లబ్ధిదారుల విచారణ నిర్వహించి ఎంపీడీవోల ద్వారా నుండి తనకు జాబితా వచ్చిందని అట్టి జాబితా ఆధారంగా తీసుకొని నిరుపేదలైన ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  ఇంటి  నిర్మాణాన్ని కోసం అవసరమైన వారు బ్యాంకు లింకేజీ రుణాన్ని వినియోగించుకోవచ్చని ఆయన సూచించారు.  ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు,  ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, గృహ నిర్మాణశాఖ పిడీ లోకీలాల్, డిఆర్డిఓ బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, చిట్యాల, రేగొండ మార్కెట్ కమిటీ చైర్మన్లు శ్రీదేవి,  కిష్టయ్య, గణపురం సింగిల్ విండో చైర్మన్  కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -