Thursday, July 23, 2026
E-PAPER
Homeజాతీయంనిరసనల్లో పాల్గొంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తాం

నిరసనల్లో పాల్గొంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తాం

- Advertisement -
  • పోలీసులు విద్యార్థులను బెదిరించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

నవతెలంగాణ-హైదరాబాద్: నిరసనల్లో పాల్గొంటే డ్రగ్స్‌ కేసులో ఇరికిస్తానని ముంబయి పోలీసులు విద్యార్థులను బెదిరించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. సిజెపికి మద్దతుగా ముంబయిలోనూ కొందరు విద్యార్థులు నిరసన చేపట్టారు. అయితే వారిపై పోలీసులసు బెదిరింపులకు దిగారు. నిరసనల్లో మళ్లీ మీరు నాకు కనిపిస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తా. అప్పుడపు మీ జీవితం నాశనమవుతుంది. బెయిల్ కూడా రాదు. జైల్లోనే మగ్గిపోవాల్సి వుంటుంది. అని విద్యార్థులను ఉద్దేశించి ఒక పోలీస్ అధికారి చెబుతున్నట్లు వీడియోలో ఉంది. ముంబయి కాంగ్రెస్ ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. వీడియోపై నగర పోలీసులు దర్యాప్తుకు ఆదేశించారు. తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ పోలీసుని పోస్టింగ్‌ నుండి తప్పించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -