Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనేంతవరకు ఆందోళన విరమించం..

ధాన్యం కొనేంతవరకు ఆందోళన విరమించం..

- Advertisement -

తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వాలి..
ఉదయం 8 నుంచి కొనసాగుతున్న ఆందోళన..
నవతెలంగాణ – మల్హర్ రావు
: ధాన్యం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ తోపాటు, ఉన్నతాధికారులు దిగివచ్చి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పితే తప్పా ఆందోళన, నిరసన విరమించేది లేదని తాడిచెర్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసిన రైతులు బిష్మిoచి రోడ్డుపై టెంట్ వేసుకొని బైఠాయించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన నిరసన కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి రైతులు పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకపోవడంతో వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేస్తాము, పెద్దపల్లి రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడుతున్నామని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య(ఫోన్లో), అలాగే వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు, డైరెక్టర్ వొన్న తిరుపతి రావు, సిఈఓ సంతోష్ రైతులు ఆందోళన చేపట్టిన వద్దకు వచ్చి చెప్పినా.. వినకుండా ఆందోళన విరమించమని, నిరసన కొనసాగిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad