Monday, September 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంత్రిబుల్‌ ఆర్‌ భూనిర్వాసితులకు అండగా ఉంటాం

త్రిబుల్‌ ఆర్‌ భూనిర్వాసితులకు అండగా ఉంటాం

- Advertisement -

ప్రొఫెసర్‌ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (త్రిబుల్‌ ఆర్‌) భూనిర్వాసితులకు అండగా ఉంటామని టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీజేఎస్‌ రాష్ట్ర కార్యాలయంలో చౌటుప్పల్‌, నారాయణపురం, గట్టుప్పల్‌, మర్రిగూడ మండలాల రైతులు కోదండరాంను కలిశారు. తమకు అండగా ఉండాలని కోరారు. త్రిబుల్‌ ఆర్‌ కొత్త అలైన్‌మెంట్‌తో కార్పొరేట్‌ కంపెనీలు, భూస్వాములకు లాభం జరుగుతుందన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు 40 కిలోమీటర్ల దూరం ఉండగా ఇప్పుడు 28 కిలోమీటర్ల దూరంలోనే త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ ఇచ్చారని ఆయన దృష్టికి తెచ్చారు. ఈ కొత్త అలైన్‌మెంట్‌తో చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు.అనంతరం భూనిర్వాసితులనుద్దేశించి కోదండరాం మాట్లాడుతూ గతంలో భూనిర్వాసితులకు సంబంధించిన అనేక పోరాటాల్లో టీజేఎస్‌ రైతుల పక్షాన పోరాటం చేసిందని గుర్తు చేశారు.

రైతులు తమ భూములకు సంబంధించిన అన్ని విషయాలపై అధ్యయనం చేసి, ఆ భూములు తమకు ఎంత విలువైనవో తెలిపేలా ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని కోరారు. ఈ విషయంలో టీజేఎస్‌ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పల్లె వినరు కుమార్‌, ఆశప్ప, భూ నిర్వాసితుల నాయకులు భీమగాని మహేష్‌ గౌడ్‌, పల్లె శేఖర్‌ రెడ్డి, పల్లె పుష్పారెడ్డి, గుండె మల్లేశం, సుర్వి రాజు, నడికుడి అంజయ్య, బద్దుల వెంకటేష్‌, వర్ధన్‌ నాగార్జున, గంట కృష్ణారెడ్డి, గుండె జంగయ్య, గాజుల భగత్‌, భాస్కర్‌ రెడ్డి, సుర్కంటి కార్తీక్‌ రెడ్డి, వడ్డేపల్లి స్వామి, సుర్కంటి శశికళ, చంద్రకళ, పల్లె పుల్లారెడ్డి, కొలను మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -