నవతెలంగాణ – కామారెడ్డి: విధి నిర్వహణలో మరణించిన గ్రేహాండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని రాష్ట్ర రవాణా, బి.సి.సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన గ్రేహాండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి మంత్రి వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వడ్ల శ్రీధర్ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిస్కరించుకోవాలని, హింస మార్గాన్ని వీడనాడాలని ఆయన అన్నారు. మరణించిన శ్రీధర్ కుటుంబానికి రూ.2.17 కోట్ల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుండి అందజేయ బడుతుందని తెలిపారు. తొలుత శ్రీధర్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని తెలిపారు. అనంతరం ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, శాసన సభ్యులు మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ లు పార్థివ దేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత పోలీసు గౌరవ వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేహ్యాండ్ కమాండర్ ఆపరేషన్ రాఘవెందర్ రెడ్డి, ఓ ఎస్ డి దయానంద్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ శంకరయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవిన్యూ వి.విక్టర్, ఆర్డీఓ వీణ, పోలీసు, రెవిన్యూ, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటాం: మంత్రి పొన్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES