- Advertisement -
- – బంబేలుతున్న బాటసారులు, భక్తులు
నవతెలంగాణ -తాడ్వాయి - ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం రహదారిలో మంగళవారం అడవి దున్నలు సంచరించాయి. వనదేవతల దర్శనానికి మేడారం ఉదయం ఏడు గంటలకు వెళుతున్న సందర్శకులు (భక్తులు) సమీపంలోని శివరాం సాగర్ చెరువు సమీపంలోకి రాగానే మూడు దున్నలు రోడ్డు దాటుతూ కనిపించాయి. ఆ దున్నలు రోడ్డు దాటేసేపు ఆగి వెళ్లిపోయారు. గ్రామానికి ఇంత దగ్గరగా రోడ్డు దాటుకుంటూ సంచరిస్తూ కనబడడంతో భక్తులకు, సమీపంలోని గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డు దాటుతున్న ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు.
- Advertisement -