Friday, January 9, 2026
E-PAPER
Homeబీజినెస్13.12 లక్షల చికెన్ బిర్యానీల ఆర్డర్లతో.. 2025లో విశాఖపట్నం ఇలా స్విగ్గీ చేసింది

13.12 లక్షల చికెన్ బిర్యానీల ఆర్డర్లతో.. 2025లో విశాఖపట్నం ఇలా స్విగ్గీ చేసింది

- Advertisement -

నవతెలంగాణ – విశాఖపట్నం : 2025 లో విశాఖపట్నం ఫుడ్ కథను పరికిస్తే, తన సౌకర్యాన్ని, వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకునే నగరాన్ని తలపిస్తుంది. క్లాసిక్ దక్షిణ భారత అల్పాహారాలు మొదలుకుని, రుచులూరించే స్నాక్-సమయపు బైట్లు, రాత్రి భోజనవిందులు మరియు రాత్రి పొద్దుపోయిన తర్వాత కోరుకునే రుచులూరించే ఆహారాల వరకు, విశాఖపట్నం యొక్క ఆర్డరింగ్ వైఖరులను గమనిస్తే, పరిచయమున్న ఆహారాలు మరియు విలువల పట్ల నిబద్ధత కలిగిన ఆహారపు అలవాట్లు కనిపిస్తాయి.

చికెన్ ప్రధానమైన ఫేవరెట్లు విస్తళ్ళలో ప్రధానమైన స్థానాన్ని సంతరించుకున్నాయి. కాగా దేశలు, ఇడ్లీలు మీల్స్ వ్యాప్తంగా నికరంగా నిలబడిఉన్నాయి. అందుబాటు ధరల్లోని ఆప్షన్లు, ఆఫీసు విందులు, హై-ప్రోటీన్ ఎంపికలు మరియు క్విక్ బోల్ట్ డెలివరీలు, ఈ ఏడు వడిని పెంచి, విశాఖపట్నం యొక్క దైనందిన లయలో ఆహారాన్ని విడదీయలేని అంతర్భాగం చేశాయి. హౌ ఇండియా స్విగ్గీడ్ యొక్క విశాఖపట్నం ఎడిషన్ ను పరిశీలించండి.నగరానికిఆహారంతో ఉన్న ప్రేమాభిమానాలు, ఈ ఏడాది రుచికరమైన ప్రధానాంశాల పునరావలోకనాల మచ్చుతునక ఇది.

నగరం మెచ్చినవి

ఏడాది పొడుగునా దాదాపు 13.12 లక్షల ఆర్డర్లను నమోదు చేసుకోవటంతో, 2025లో విశాఖపట్నంలో చికెన్ బిర్యానీ అత్యధికంగా ఆర్డర్ చేయబడిన వంటకంగా నిలిచింది. దాని తర్వాత స్థానిక వంటకాలైన వెజ్ దోశ, ఇడ్లీ మరియు ఉల్లి దోశలు నగరం అతి ఎక్కువగా ఆర్డర్ చేసిన 5 వంటకాల్లో స్థానాన్ని దక్కించుకున్నాయి.
రుచికరమైన డెస్సర్ట్స్ కోసం ఆసక్తి పెరిగినట్లు కనిపించింది. అతి ఎక్కువగా ఆర్డర్ చేయబడిన డెస్సర్ట్ (తీపి పదార్ధం) స్థానాన్ని చాక్లెట్ కేక్ దక్కించుకోగా, వేడుకలను సౌకర్యంతో మేళవిస్తూ తదుపరి స్థానాలను మ్యాంగో రస్ మలాయ్, గులాబ్ జామున్, మరియు బూందీ లడ్డూలు స్వంతం చేసుకున్నాయి.
విశాఖపట్నంలో ఉదయపు వేళలు సాంప్రదాయానుగుణంగా నడుస్తాయి. 1.47 లక్షల ఆర్డర్లతో వెజ్ దోశ అల్పాహారాల విషయంలో అగ్రస్థానంలో నిలువగా, కొద్దిపాటి తేడాలో (1.43 లక్షల ఆర్డర్లతో) వెజ్ ఇడ్లీలు రెండవ స్థానంలో నిలిచాయి. ఉల్లి దోశ, వెజ్ వడ మరియు పూరిలు నగరం అత్యధికంగా ఎంచుకున్న ఐదు అల్పాహారాల్లో చోటుచేసుకోవటంతో, ఉదయపు వేళల్లో నగరం తెలిసిన, తేలికపాటి ఆహారాలను తీసుకుంటోంది.
సాయంకాలపు వేళల్లో ఆకలి వేళల్లో సా. 3 గం. మరియు సా. 7 గం. మధ్యలో స్నాక్ టైమ్ ఖచ్ఛితంగా రసవత్తరంగా మారింది. రోజుకు సగటున 165 ఆర్డర్లతో చికెన్ బర్గర్లు అగ్రస్థానంలో నిలువగా, తదుపరి స్థానాలను చికెన్ ఫ్రై మరియు చికెన్ నగ్గెట్లు స్వంతం చేసుకున్నాయి. దానితో, సాయంకాలాలు సౌకర్యప్రధానమైనవిగా మారాయి.

  • విశాఖపట్నంలో అందరూ ఇష్టపడే భోజనకాలంగా డిన్నర్ (రాత్రి భోజనం) ఆవిర్భవించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిన్నర్ ఆర్డర్లు 23 శాతం పెరిగాయి. సంతృప్తికరమైన భోజనంతో రోజును ముగించాలన్న నగర ప్రజల మనోభావానికి ఇది దర్పణం పడుతుంది.
  • ఆర్డర్లు ఏ యేటికా యేడు 48 శాతం పెరుగుతున్న నేపథ్యంలో, అర్ధరాత్రి 12 గం. మరియు తెల్లవారు ఝామున 2 గంటల మధ్య రాత్రి పొద్దుపోయిన సమయంలో బింజింగ్ బాగా. నచ్చిన రుచుల కోసం ఆర్డర్ చేయటం ప్రధానకేంద్రాన్ని సంతరించుకుంది – రాత్రి పొద్దుపోయిన తర్వాత అందుతున్న ఆర్డర్లలో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలవగా, చికెన్ బర్గర్లు మరియు చికెన్ నగ్గెట్లు తదుపరి స్థానాలను స్వంతం చేసుకుని, విశాఖపట్నంలో రాత్రి వేళలు కూడా పగటివేళల్లాగానే సుగంధభరితమైన రుచులతో కూడినదని నిరూపిస్తోంది.
  • నగరం అభిమానిస్తున్న వంటకాలను పరిశీలిస్తే, బలమైన ప్రాంతీయ ప్రభావం కనిపిస్తుంది. 64 శాతం పెరుగుదల నమోదు చేసుకున్న మహారాష్ట్ర వంటకాల పట్ల నగరంలో అభిమానం వేగంగా పెరుగుతోంది.
  • ప్రయాణపు వేళల్లో ఆహారం కోసం ఆర్డర్లు కూడా వేగాన్ని పుంజుకున్నాయి. విశాఖపట్నం జంక్షన్ లో 2025లో ఫుడ్ ఆన్ ట్రెయిన్ ఫీచర్ ద్వారా ఆర్డర్లలో భారీ స్థాయిలో 171 శాతం అభివృద్ధి చోటుచేసుకుంది, ప్రయాణాల్లో ఫుడ్ డెలివరీ ఒక అత్యవసరమైన భాగంగా ఎలా మారుతోందో దీనితో అర్ధమవుతుంది.
  • స్విగ్గీ వారి అందుబాటు ధరల్లోని 99 స్టోర్ పై, చికెన్ బిర్యానీ అత్యంత అభిమానాన్ని చూరగొన్న వంటకంగా ఆవిర్భవించింది. రోజుకు దాదాపు 233 సార్లు ఆర్డర్ అయ్యింది. వెజ్ దోశ మరియు వెజ్ ఇడ్లీలు రెండవ మరియు మూడవ స్థానాలను వరుసగా దక్కించుకున్నాయి.
  • పనిచేసే వేళల్లో విశాఖపట్నం ప్రొఫెషనల్స్ తమ లంచ్ లకుగాను స్విగ్గీ పట్ల భరోసా చూపుతున్నారు. డెస్క్ఈట్స్ పై, రోజుకు దాదాపు 157 ఆర్డర్లతో చికెన్ పాప్ కార్న్ ప్రథమ స్థానంలో నిలిచింది. వెజ్ ఇడ్లీ మరియు మసాలా దోశ వరుసగా 2వ మరియు 3వ స్థానాల్లో నిలిచాయి.
  • 2025లో హై-ప్రోటీన్ ఫుడ్ కు కూడా ప్రాధాన్యం పెరిగింది. ఏడాది అంతటా 2.12 లక్షల హై-ప్రోటీన్ ఆర్డర్లు లభించాయి.

బోల్ట్ తో వేగంగా ఫుడ్ డెలివరీ సాధ్యం అయ్యింది

  • ఎల్లప్పుడూ సందడిగా ఉండే నగరంలో వేగానికి ప్రాధాన్యం కొనసాగుతోంది. బోల్ట్ పై 2.5 లక్షల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ కార్టుల్లో ప్రథమ స్థానంలో నిలిచింది.దాని తర్వాత వెజ్ దోశ మరియు వెజ్ ఇడ్లీ రెండవ మరియు మూడవ స్థానాల్లో వరుసగా నిలిచాయి.
  • బోల్డ్ లో అత్యధికంగా ఆర్డర్ చేసిన మూడు తీపిపదార్ధాలుగా రస్­మలాయ్, బొబ్బట్లు ఇంకా చాకో లావా కేకులు నిలిచాయి.  ఒక మెరుపులాంటి క్షణంలో నిజమైన పిడుగుపాటులో, ఒక కస్టమర్­కు  కేవలం మూడు నిముషాల్లో ఒక ప్లేట్ చికెన్ దమ్ బిర్యానీ ని డెలివర్ చేయటం జరిగింది.
  • రాత్రి పొద్దుపోయిన తర్వాత లభిస్తున్న బోల్ట్ ఆర్డర్లలో రుచికరమైన ఆహారాల పట్ల భారీగా మొగ్గు కనిపిస్తోంది. అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుఝామున 2 గంటల మధ్య నమోదైన ఆర్డర్లలో చికెన్ బిర్యానీ, చికెన్ బర్గర్లు మరియు చికెన్ నగ్గెట్లు అతి ఎక్కువగా ఆర్డర్ చేయబడినవిగా ఆవిర్భవిస్తున్నాయి.
  • చిట్టచివరిలో సమకూర్చుకోవలసిన వస్తువులు గొప్ప క్షణాలకు దారి తీశాయి – నగరంలో అతి పెద్ద బోల్ట్ ఆర్డర్­లో 16 పిజ్జాలు మరియు 28 చాకో లావా కేక్­లు ఉన్నాయి.

ట్రెండ్లను మరింత వివరంగా తెలియచేస్తూ, సిద్ధార్థ్ భాకూ, ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్, ఫుడ్ మార్కెట్ ప్లేస్, స్విగ్గీ ఇలా చెప్పారు “2025లో, దైనందిన జీవితంలోనూ మరియు వేడుకల్లో కూడా ఆహారం ప్రధానమైన పాత్రను పోషించటం కొనసాగింది. భారతదేశం తాను మెచ్చిన వంటకాల పట్ల అభిమానాన్ని ప్రదర్శించింది. విశాఖపట్నం నగరంలో మాకు, క్లాసిక్స్ పట్ల ప్రేమాభిమానాలు మరియు జాతీయస్థాయిలో ప్రజలు అభిమానించిన వంటకాల పట్ల సమతౌల్యం కనిపించింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత తెప్పించుకున్న రుచికరమైన ఆహారాలు మొదలుకుని ప్రీమియం డైనింగ్ అవుట్ వరకు, విశాఖపట్నం నగరం ఆహారం ద్వారా ఘనమైన టేప్స్ట్రై  సంస్కృతిని అవలంబించింది.  ఆహారం ఒక భావన. నగరంలో మూలమూలలకు అద్భుతమైన ఆహారపు అనుభవాలను డెలివర్ చేయాలన్న సంకల్పానికి మేము కట్టుబడి ఉన్నాము. ఒక భోజనం, ఒక వేడుక ఒక సారి.”

డైనింగ్ అవుట్

  • 2025లో విశాఖపట్నంలో డైనింగ్ అవుట్­ స్థిరంగా వడి పుంజుకుంది. స్విగ్గీ డైనవుట్ ద్వారా దాదాపు 60,000ల డైనర్లు సీట్ చేయబడ్డారు
  • స్విగ్గీ డైనవుట్ ద్వారా 1.52 కోట్ల రూపాయలను నగరం సమగ్రంగా ఆదా చేసుకుంది. ఒక సింగిల్ బుకింగ్­లో ఒక కస్టమర్ 21,495 రూపాయల సొమ్ము ఆదాను అన్­లాక్ చేసుకున్నారు. ఇది నగరంలో అత్యధికం.
  • ప్రీమియం డైనింగ్ అనుభవాల పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ సగటున రోజుకు 27కు పైగా బుకింగులతో ప్రీమియం డైనింగ్­కు కూడా అభిమానులు పెరిగారు.
  • వేడుకలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. మదర్స్ డే నాడు, నగరంలో ఒక సింగిల్ బిల్లుంగులో అత్యధికంగా రూ. 17,926లను కస్టమర్ ఖర్చు చేశారు. ఫాదర్స్ డే రోజున నగరంలో అత్యధికంగా నమోదైన ఖర్చు రూ. 16,894గా నమోదయ్యింది. ఒక మంచి భోజనంతో ప్రత్యేకమైన క్షణాలను వేడకగా జరుపుకోవటం పట్ల నగరానికి ఉన్న ఆసక్తిని ప్రత్యేకంగా చూపుతుంది.

వినోదాన్ని మరింతగా ఇనుమడింపజేసే విధంగా, 2025లో భారతదేశపు ఆహారపు ట్రెండ్ లను కొన్నింటిని ఈ దిగువ చూడండి

  • అతిఎక్కువ ఆదరాభిమానాలను చూరగొంటున్న వంటపదార్ధంగా దశాబ్దకాలంగా రికార్డు నెలకొల్పుతున్న బిర్యానీ ఇప్పటికీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది! 2025లో 93 మిలియన్ బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి (అంటే నిముషానికి 194 ఆర్డర్లు లేదా ప్రతి సెకండుకు 3.25 బిర్యానీలు). దీనితో, బిర్యానీ సాటిలేని మహరాజుగా నిలిచి, ట్రెండ్స్ వస్తుంటాయి పోతుంటాయి కాని, సుగంధాలు చిమ్మే ఈ మహత్తరమైన వంటకం పట్ల భారతదేశానికి ఉన్న లోతైన ప్రేమ ఎన్నటికీ నిలిచిపోతుందని నిరూపించింది. బిర్యానీ ప్రపంచంలో అతి ఎక్కువగా రిపీట్ ఆర్డర్లను సాధించిన చికెన్ బిర్యానీ (57.7 మిలియన్ ఆర్డర్లతో)  అత్యధిక అభిమానాన్ని చూరగొన్నది.
  • 44.2 మిలియన్ ఆర్డర్లను పొందిన బర్గర్లు అత్యధికంగా అభిమానాన్ని చూరగొన్న పదార్ధాల్లో రెండవ స్థానంలో నిలువగా, దాని తర్వాత స్థానంలో 40.1 మిలియన్ ఆర్డర్లతో పిజ్జాలు నిలిచాయి. 26.2 మిలియన్ ఆర్డర్లతో వెజ్ దోస వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొన్న మరొక వంటకంగా నిలిచింది. పెళుసుగా, బంగారు వన్నెలో ఉండే ఈ మహత్తరమైన వంటకం పట్ల భోజనప్రియులు మక్కువ చూపించారు.
  • స్నాక్ సమయం (3- 7 సా.) ఒక మూడ్, మనం అందరం అందులో జీవిస్తాము. స్నాక్స్ లో అతి ఎక్కువగా ఆర్డర్ చేయబడినవి బర్గర్లు కాగా, అందులో చికెన్ బర్గర్లు (6.3 మిలియన్ ఆర్డర్లతో) అగ్రస్థానంలో నిలువగా, స్వల్ప వ్యత్యాసంతో 4.2 మిలియన్ ఆర్డర్లు సాధించిన వెజ్ బర్గర్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. వినియోగదారు మెచ్చిన ఇతర స్నాక్ పదార్ధాలు – చికెన్ రోల్ (4.1 మిలియన్ ఆర్డర్లు), వెజ్ పిజ్జా (3.6 మిలియన్ ఆర్డర్లు) ఇంకా చికెన్ నగ్గెట్స్ (2.9 మిలియన్ ఆర్డర్లు).
  • 2025లో స్నాక్ సమయంలో (సా.3 గం.- సా.7 గం.) మధ్య 3.42 మిలియన్ సమోసాలు ఇంకా 2.9 మిలియన్ అల్లం చాయ్ ల ఆర్డర్లతో చాయ్-సమోసా సాంప్రదాయం కొనసాగింది.
  • డెస్సర్ట్ డిలైట్ లు ఇంకా రుచికరమైన పదార్ధాలు: 6.9 మిలియన్ ఆర్డర్లతో వైట్ చాక్లెట్ అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, 2025 సంవత్సరంలో దేశీ మిఠాయిల పట్ల అభిమానం కనిపించింది. చాక్లెట్ కేకులు(5.4 మిలియన్ ఆర్డర్లతో) ఇంకా గులాబ్ జామూన్లు (4.5 మిలియన్ ఆర్డర్లతో) అత్యధికంగా ఆర్డర్ చేయబడిన 3 డెస్సర్ట్స్ లో స్థానాన్ని దక్కించుకున్నాయి. కాజూ బర్ఫీ (2 మిలియన్ ఆర్డర్లతో), ఇంకా బేసన్ లడ్డూ (1.9 మిలియన్ ఆర్డర్లతో) భారతదేశపు మిఠాయిలలో 2వ మరియు 3వ స్థానాలను స్వంతం చేసుకున్నాయి.
  • డార్క్ చాక్లెట్ ఐస్ క్రీములు 3.3 మిలియన్ ఆర్డర్లను, చాక్లెట్ సండేస్ 2.6 మిలియన్ ఆర్డర్లను దక్కించుకోవటంతో ఐస్ క్రీమ్ లలో ఈ ఏడాది చాక్లెట్ ఫ్లేవర్ స్వంతం అయ్యింది.
  • మెక్సికన్ (16 మిలియన్ ఆర్డర్లు), టిబెటన్ (12 మిలియన్లకు పైగా ఆర్డర్లు), కొరియన్ (4.7 మిలియన్ ఆర్డర్లు) వంటకాలు వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటూండటంతో, అంతర్జాతీయ వంటకాలు కార్టులలోకి వచ్చి చేరుతున్నాయి. 2025లో అతి ఎక్కువగా సెర్చ్ చేయబడిన అంతర్జాతీయ వంటకంగా మచ్చా నిలిచింది.
  • స్థానిక వంటల పట్ల ప్రేమాభిమానాల నేపథ్యంలో హైపర్ లోకల్ అనేది కొత్త అథెంటిక్ గా నిలిచింది. గత ఏడాది కాలంలో పహాడీ శాకపాకాలు (వంటలు) 9 రెట్లు పెరుగుదల నమోదు చేసుకోగా, మలబరీ, రాజస్థానీ, మాల్వానీ, తదితర ప్రాంతీయ శాకపాకాలు కూడా దాదాపు 2 రెట్లు పెరిగాయి.
  • అన్ని భోజనవేళలతో పోలిస్తే రాత్రి భోజనం (డిన్నర్) బాహుబలి వంటిదనటంలో ఎటువంటి సందేహం లేదు. లంచ్ ఆర్డర్లతో పోలిస్తే డిన్నర్ ఆర్డర్లు 32 శాతం అధికంగా నమోదు చేసుకున్నాయి.
  • విశాల హృదయం, భారీ వేడుకలు : హైదరాబాద్ లో ఒక కన్స్యూమర్ రూ. 47,106 లు ఖర్చు పెచ్, 65 డబ్బాల డ్రై ఫ్రూట్ కుకీల గిఫ్ట్ ప్యాక్ లను ఆగస్టులో ఆర్డర్ చేసి పండుగ సీజన్ కు శ్రీకారం చుట్టారు!
  • ముంబయ్ లో ఒక ఫుడీ “డైనింగ్ ఆల్ డే (రోజంతా డైనింగ్)”ను పునర్నిర్వచించి, 2025లో స్విగ్గీలో 3,196 ఫుడ్ ఆర్డర్లను చేసి ఉన్నారు. అంటే, దాదాపు రోజుకు 9 ఆర్డర్లు అన్నమాట – దేశంలో కల్లా అత్యధికం!
  • తాము మెచ్చిన ఆహారం కోసం, ఆకలి వేళల చూసే ఆ ఎదురుచూపుల కోసం సమయానికి వేగంగా ఫుడ్ డెలివరీ చేసేందుకు బోల్ట్ దన్నుగా నిలిచింది. బెంగుళూరులో అత్యధిక సంఖ్యలో డెలివరీలు జరిగాయి, ఆ తర్వాత హైదరాబాద్ మరియు ముంబయ్ లలో జరిగాయి. ఇంకా, అహ్మదాబాద్, జైపూర్, వైజాగ్ మరియు కొచ్చిలు కూడా బోల్ట్ కు ఆవిర్భవిస్తున్న మార్కెట్లుగా నిలిచాయి.
  • ఆసక్తికరంగా, ముంబయ్ లో ఒక కస్టమర్ భారీ స్థాయిలో విందుభోజనం కోసం ఆర్డర్ చేశారు – 15 యూనిట్ల దమ్ చికెన్ బిర్యానీ, 10 ప్లేట్ల చికెన్ మీట్ బాల్ కబాబ్, 5 ప్లేట్ల ఫలాఫర్-ఎ-ఖాస్, ఇంకా పెప్పర్ పనీర్ బిర్యానీ, 100 గులాబ్ జామూన్ల కోసం 99Store లో ఆర్డర్ చేశారు! చాలా పెద్ద పార్టీలా ఉన్నది!
  • నిజంగా దీన్ని సుసాధ్యం చేసిన మా డెలివరీ పార్టనర్లు, మీరు కోరుకున్న ఆహారాలకు చిరునవ్వులను అద్ది, , హాట్ మీల్ ను అందించటంలో సహకరించారు! మా డెలివరీ పార్ట్నర్లు ఈ ఏడాది చారిత్రాత్మకమైన విధంగా 1.24 బిలియన్ కిలోమీటర్లు నమోదు చేశారు – కష్మీరు నుండి కన్యాకుమారికి 340,000 సార్లు మథ్యలో చాయ్ కోసం ఆగుతూ డ్రైవ్ చేయటం లాంటిది!
  • మొహమ్మద్ రజీఖ్ అనే బెంగుళూరుకు చెందిన మా డెలివరీ పార్ట్నర్, అవిశ్వసనీయమైన విధంగా ఈ ఏడాదిలో 11,718 ఆర్డర్లు డెలివర్ చేశారు. కాగా చెన్నైకి చెందిన పార్ట్నర్ పూంగోడి, 2025లో 8169 ఆర్డర్లు డెలివర్ చేసి మహిళా పార్ట్నర్లలో ప్రథమ స్థానంలో నిలిచారు!
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -