పెరుగులో ప్రొటీన్లు, కేల్షియం, విటమిన్ బి, విటమిన్ డి, యాంటీ బాక్టీరియల్ గుణాలుంటా యి. ఇవి చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ముఖంపై ఉండే మచ్చలను తగ్గించి చర్మాన్ని, శరీరానికి హానికరం కాకుండా సహజంగా శుభ్రపరుస్తుంది. పెరుగులోని లాక్టిక్ యాసిడ్ కూడా చర్మంలోకి లోతుగా ప్రవేశించి సున్నితమైన చర్మాన్ని అందిస్తుంది.
పెరుగును ఎలా ఉపయోగించాలి..? :చర్మం జిడ్డు అయితే పుల్లటి పెరుగును వాడాలి, దానిలో ఎక్కువ నూనె ఉంటుంది. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. పొడి చర్మం ఉన్న వారు తియ్యని మీగడ పెరుగును వాడటం మంచి ఆప్షన్.
గోధుమ పిండి, పెరుగు : ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ పెరుగును తీసుకోండి. దానిలో ఒక స్పూన్ గోధుమ పిండి కలపండి. గోధుమ పిండి ముఖానికి బ్లీచింగ్ ఏజెంట్గా పని చేస్తుంది. ఇది ముఖంపై ఉండే నలుపుదనాన్ని తగ్గించి చర్మం ప్రకాశవంతంగా మారడానికి సహాయ పడుతుంది. అయితే జిడ్డు చర్మం ఉన్న వారు ఇందులో నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 10-15 నిమిషాలు వెయిట్ చేయండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, నలుపుదనం, మత కణా లు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది.
పెరుగుతో అందం : పెరుగులోని ప్రాకతిక లక్షణాలు చర్మంలో డీప్ క్లీనింగ్ చేస్తూ.. చర్మ సమస్యలను తగ్గిస్తాయి. పెరుగులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని క్లీన్ చేసి చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు, నలుపుదనాన్ని తగ్గిస్తాయి.
పెరుగుతో…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



