- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని లచ్చన్ గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం శనివారం నిర్వహించారు. ఈ గ్రామంలో జరిగిన గణేష్ నిమజ్జనంలో ఆడేవారు మహిళలు చూసేవారు కూడా మొత్తానికి మొత్తం మహిళలే కనిపించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మగవాళ్లు ఉన్నప్పటికీ ఆడవాళ్ళ ఆటపాట కోసమే వారికే వదిలిపెట్టడం గణేష్ నిమజ్జనం లచ్చన్ గ్రామంలో ఆదర్శంగా జరిగింది. గణేష్ నిమజ్జనంలో మొత్తానికి మహిళలే ఉండటం ఆటపాటలతో శాంతియుతంగా నిమజ్జనం జరిగింది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో మహిళలు ఆనందోత్సవాల మధ్య ఆట పాటల్లో పాల్గొన్నారు.
- Advertisement -