నవతెలంగాణ – తొగుట
దేశానికి వెన్నుముక యువత వారు సన్మార్గం లో నడిచినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని తొగుట సీఐ ఎస్కె లతీఫ్ అన్నారు.  శుక్రవారం దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సంద ర్భంగా జాతీయ సమైక్యత దినోత్సవంను పురస్క రించుకొని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తొగుటలో పోలీస్ సిబ్బంది, యువతతో కలిసి 2కే రన్ నిర్వ హించారు. పోలీస్ స్టేషన్ నుంచి రాంపూర్ దేవా లయం వరకు రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ .. మద్యం, అశ్లీల సినిమాలు, సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమ్స్, డ్రగ్స్ యువత పై చాలా ప్రభావం చూపుతున్నాయని అన్నారు. 
వాటి నుంచి బయటపడి వారి బంగారు భవిష్యత్తు కోసం ముందుకు సాగాలన్నారు. మద్యానికి బాని సై మద్యం సేవించడం వల్ల 90 శాతం రోడ్డు ప్రమా దాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్లు వాహనం నడిపినా, మద్యం సేవించి వాహ నం నడిపినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, వాహనా లకు నెంబర్ ప్లేట్ లేకున్నా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహా పురుషులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా జాతీయ సమైక్యతతో కలిసి మెలిసి ఉండలని పేర్కొన్నారు. కార్యక్రమం లో తొగుట ఎస్సై రవి కాంతారావు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు, పోలీస్ సిబ్బంది, యువత తదితరులు పాల్గొన్నారు.

 
                                    