‘మిరాయ్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 17న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాశి ఖన్నా శనివారం మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇప్పటివరకు చాలా ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ చూశాం. కానీ ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటి అనేది మీరు థియేటర్స్లోనే చూడాలి (నవ్వుతూ). దర్శకురాలు నీరజ ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అంత యూనిక్ స్క్రిప్ట్ ఎలా రాయగలిగారనిపించింది. అలాగే ఈ సినిమా షూటింగ్లో చాలా సర్ప్రైజ్ అయ్యాను. అలాంటి సర్ప్రైజ్ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత లవ్, బౌండరీస్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు.
ఇలాంటి పాయింట్తో వచ్చిన సినిమాని నేను చూడలేదు. నీరజ ప్రతి క్యారెక్టర్ని అద్భుతంగా రాసింది. చాలా లేయర్స్ ఉన్నాయి. ఇందులో మూడు పాత్రలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ మూడు పాత్రలు బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్. ఇందులో అంజలి పాత్రలో కనిపిస్తాను. నా రియల్ లైఫ్కి ఆ పాత్రకు ఏ మాత్రం పోలికలు లేవు. సిద్దు ఆన్ సెట్లో క్రాఫ్ట్ మీద చాలా సీరియస్గా ఉంటారు. తనతో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. శీనిధి, నా కాంబినేషన్లో చాలా మంచి సీన్స్ ఉన్నాయి. అవన్నీ మీకు బాగా నచ్చుతాయి. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా ప్యాషన్తో వర్క్ చేస్తారు. ‘మల్లిక గంధ’ పెద్ద హిట్ అయ్యింది. పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. నిర్మాత విశ్వ ప్రసాద్తో ‘వెంకీ మామ’ చేశాను. ఇది సెకండ్ ఫిల్మ్. చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. సినిమాకి కావాల్సిన ప్రతీదీ సమకూర్చారు.
పవన్ కళ్యాణ్తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నా. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆయన ఫాలోయింగ్, ఒరా నెక్స్ట్ లెవల్. అలాగే హిందీలో నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. నాకు మైథలాజికల్ సినిమాలు ఇష్టం. అలాగే హర్రర్ బ్యాక్డ్రాప్ ఉన్న కథలు కూడా ఇష్టమే. అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తా.
హీరోయిన్ రాశిఖన్నా