Thursday, August 13, 2026
E-PAPER
Homeజాతీయం80వ స్వాతంత్య్ర వేడుకలు..ముస్తాబైన ఎర్రకోట

80వ స్వాతంత్య్ర వేడుకలు..ముస్తాబైన ఎర్రకోట

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధానిలోని 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఎర్రకోట సిద్ధమైంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎగురవేయనున్నారు. ఈ ఏడాది ‘వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, వికసిత్ భారత్@2047 కోసం యువశక్తి’ థీమ్‌లతో వేడుకలు జరపనున్నారు.

జ్ఞానపథ్‌లో వందేమాతరం ఆకృతిలో 2,500 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, ‘మై భారత్’ వాలంటీర్లు కూర్చోనున్నారు. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వివిధ రంగాలకు చెందిన దాదాపు 5 వేల మందికి అధికారులు ప్రత్యేక ఆహ్వానం పంపారు.

మరోవైపు, పర్యాటకుల సౌకర్యార్థం ఉచిత మెట్రో ప్రయాణం, క్యూఆర్ కోడ్ ఈ-ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. వేడుకలు ముగిసిన వెంటనే ఎర్రకోట పరిసరాల్లో చెత్త తొలగింపు కోసం ‘స్వచ్ఛత ప్రచారం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -