- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల అంశంలో హైకోర్టు స్టేపై 50పేజీల సమగ్ర సమాచారంతో ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసును రిఫరెన్స్గా చూపింది. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని ప్రస్తావించింది. 50% రిజర్వేషన్ల క్యాప్ దాటొద్దని చెప్పినా అది విద్య, ఉపాధి రంగాలకే పరిమితమని గుర్తు చేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశముంది.
- Advertisement -