- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పిడుగు శబ్దానికి జేబులో ఉన్న సెల్ఫోన్ పేలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి జిల్లా ముంచం గిపుట్టు మండలం తోటలామెట్ట గ్రామానికి చెందిన గిరిజనుడు మోహనారావు(58) ఆదివారం సాయంత్రం గ్రామం నుంచి గాల్లెలపుట్టుకు వెళ్తుండగా మార్గం మధ్యలో భారీ వర్షం కురిసింది. అక్కడే పిడుగు కూడా పడింది. ఈ శబ్దానికి ప్యాంట్ జేబులో ఉన్న సెల్ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. మోహన్ రావు పొట్ట కుడి భాగం తీవ్రంగా కాలింది. దీనిని గమనించిన స్థానికులు ప్రైవేట్ వాహనంలో అతడిని ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -