- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో క్లౌడ్, యాపిల్ క్లౌడ్ సమాచారం ఇవ్వాల్సిందేనని పేర్కొంది. యూజర్, పాస్వర్డ్ల సమాచారం ఇవ్వాలని జస్టిస్ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్కు సూచించింది. సమాచారం చెరిపేందుకు యత్నించినట్లు తేలితే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది.
- Advertisement -