Monday, October 27, 2025
E-PAPER
Homeక్రైమ్పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

పెట్రోల్ పోసుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏడాదిన్నర కాలంగా తన భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన కామారెడ్డి పట్టణం అడ్లూర్ శివారులోని రాధాస్వామి సత్సంగ్ వెనకాల సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి(37) ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. అయితే జీవన్ రెడ్డికి ముస్తాబాద్ మండలం మొరాయిపల్లి గ్రామానికి చెందిన చందనతో వివాహం జరిగింది. వీరికి మోక్ష, కృతిక అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య గత రెండు మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఏడాదిన్నర నుంచి చందన తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఎన్నిసార్లు అడిగినా కాపురానికి రాలేదు.

ఇటీవల విడాకుల నోటీసులు కూడా రావడంతో జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఉదయం 7:30 ప్రాంతంలో డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బైకుపై ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఇంట్లో నుంచి వెళ్లిన జీవన్ రెడ్డి కామారెడ్డి పట్టణం అడ్లూర్ శివారులో గల రాధాస్వామి సత్సంగ్ బ్యాస్ ఆశ్రమం వెనకాల శవమై ఉన్నాడని సమాచారం వచ్చింది. పక్కనే పశువుల కాపరి మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, రూరల్ సీఐ రామన్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కొద్దిసేపటి తర్వాత జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఘటన స్థలానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -