- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్.వై. మేటి (79) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మేటి బెంగళూరులోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మేటి 14వ కర్ణాటక శాసనసభసభ్యుడిగా, సిద్ధరామయ్య మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2013లో బాగల్ కోట్ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఆయన ఇటీవల గులేదగడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

- Advertisement -



