Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో క్షిణించిన గాలి నాణ్య‌త‌..పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు

ఢిల్లీలో క్షిణించిన గాలి నాణ్య‌త‌..పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసులు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు పూర్తిగా క్షీణించాయి. సోమవారం 362గా ఉన్న ఎక్యూఐ స్థాయిలు మంగళవారం ఉదయానికి 425గా నమోదైంది. గాలి ణ్యాతలు క్షీణించడంతో కమిషన్‌ ఫర్‌ ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ (సిఎక్యూఎం) మంగళవారం దేశ రాజధాని ప్రాంతం అంతటా గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (జిఆర్‌ఎపి) కింద స్టేజ్‌ 3 నిబంధనల్ని కమిషన్‌ అమలు చేసింది. గాలి నాణ్యతా స్థాయిలను తీవ్ర కేటగిరీగా వర్గీకరించింది.
గా, గ్రాప్‌ 3 నిబంధనల్లో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలతో పాటు, నాలుగుచక్రాల వాహనాల రాకపోకల్ని నిలిపివేసింది. నిర్మాణ పనులను నిషేధించింది. 5వ తరగతి పిల్లలకు ఆన్‌లైన్‌ క్లాసు నిర్వహించాలని కమిషన్‌ సూచించింది. ఢిల్లీతోపాటు గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌, గౌతమ్‌ బుద్ధనగర్‌లో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -