నవతెలంగాణ – హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ కోసం హాజరయ్యారు. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చిన ఆయన నేరుగా అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో 2013 సెప్టెంబరు నుంచి జగన్ మధ్యంతర బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేండ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది. ఈ పరిణామం క్రమంలో రేపటిలోపు వ్యక్తిగతంగా హాజరవ్వాలని జగన్ను కోర్టు ఆదేశించడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సీబీఐ కోర్టులో విచారణకు హాజరైన మాజీ సీఎం జగన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



