Thursday, November 20, 2025
E-PAPER
Homeబీజినెస్శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన వి (Vi) 

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన వి (Vi) 

- Advertisement -

– యాత్రికులు సౌకర్యవంతంగా కనెక్ట్ అవ్వడానికి సన్నిధానం, పంపా మరియు నీలక్కల్ వ్యాప్తంగా 5 స్పెక్ట్రమ్ బ్యాండ్‌లలో 70 MHz స్పెక్ట్రమ్‌ను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తుంది. 
– వి సురక్ష రిస్ట్ (మణికట్టు)  బ్యాండ్‌ల కోసం సౌకర్యవంతమైన రీతిలో ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ  ఈరోజు ప్రారంభమైంది. 
– శబరిమలలో అతిపెద్ద వార్షిక తీర్థయాత్రలలో ఒకదానికి కేరళ సిద్ధమవుతుండగా, రాష్ట్ర పోలీసులు మరియు కేరళలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వి (Vi) , సౌకర్యవంతమైన, సురక్షితమైన తీర్థయాత్రను నిర్ధారించడానికి మరోసారి చేతులు కలిపాయి.
నవతెలంగాణ – హైదరాబాద్: సన్నిధానం, పంపా మరియు నీలక్కల్ వ్యాప్తంగా తమ కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా యాత్రికులు శబరిమల మార్గంలో కనెక్ట్ అయి ఉండేలా చూసుకోవడానికి వి తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేసింది. ఇది L900, L1800, L2100, L2300, L2500లలో స్పెక్ట్రమ్ బ్యాండ్‌ల వ్యాప్తంగా  70 MHz స్పెక్ట్రమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. పతనంతిట్ట జిల్లాలో 13 కొత్త సైట్‌లను జోడించింది.

ఈ ప్రదేశాలలో సౌకర్యవంతమైన కనెక్టివిటీని నిర్ధారించడానికి, వి ఇప్పుడు మాసివ్ మిమో (MIMO)  టెక్నాలజీతో అధునాతన FDD మరియు TDD లేయర్లను అందుబాటులోకి తెచ్చింది, ఇది తీర్థయాత్ర రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా బలమైన డేటా మరియు వాయిస్ సేవలను అందిస్తుంది.

గణపతి కోవిల్, నడపంతల్, పరిపాలన కార్యాలయాలు, పంపా -సన్నిధానం ట్రెక్కింగ్ మార్గం మరియు నీలక్కల్ పార్కింగ్ మరియు బస్ స్టాండ్ వద్ద కనెక్టివిటీని గణనీయంగా బలోపేతం చేశారు, దీనివల్ల భక్తులు తమ కుటుంబాలతో నిత్యము మాట్లాడుతూ  ఉండటానికి, సమాచారాన్ని పొందటానికి , వారి ఆధ్యాత్మిక అనుభవాలను సౌకర్యవంతంగా  పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

వి సురక్ష 
గత సంవత్సరం నిర్వహించిన వి సురక్ష కార్యక్రమానికి సానుకూల స్పందన వచ్చిన తరువాత, వి మరోసారి కేరళ పోలీసులతో భాగస్వామ్యం కుదుర్చుకుని పిల్లలకు క్యుఆర్ -కోడెడ్ భద్రతా మణికట్టు బ్యాండ్‌లను అందించనుంది. ప్రతి మణికట్టు బ్యాండ్ సంరక్షకుడి కాంటాక్ట్ నంబర్‌కు అనుసంధానించబడి ఉంటుంది, తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబాలతో త్వరగా తిరిగి కలపడానికి పోలీసులకు సహాయపడుతుంది.

ఈ సంవత్సరం వి సరళీకృత ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రవేశపెట్టింది, దీని ద్వారా కుటుంబాలు బేస్ క్యాంప్‌కు చేరుకునే ముందుగానే నమోదు చేసుకోవచ్చు మరియు పంబా బేస్ క్యాంప్‌లోని ఏదైనా వి సురక్ష కియోస్క్‌ల నుండి భద్రతా బ్యాండ్‌లను పొందవచ్చు.
– తల్లిదండ్రులు / సంరక్షకులు www.visuraksha.online కు లాగిన్ అవ్వడం ద్వారా లేదా కేరళ వ్యాప్తంగా ఉన్న ఏదైనా వి స్టోర్ లేదా వి మినీ స్టోర్‌ను సందర్శించడం ద్వారా వారి పిల్లలకు  వి సురక్ష రిస్ట్ బ్యాండ్ కోసం ముందస్తుగా నమోదు చేసుకోవచ్చు మరియు వారి తీర్థయాత్రకు బయలుదేరే ముందు డిజిటల్ రిజిస్ట్రేషన్ ఐడి ని పొందవచ్చు

•       తీర్థయాత్ర సమయంలో, తల్లిదండ్రులు పంబా బేస్ క్యాంప్‌లోని ఏదైనా వి సురక్ష కియోస్క్‌లలో డిజిటల్ రిజిస్ట్రేషన్ ఐడిని చూపించి, వారి కాంటాక్ట్ నంబర్‌తో అప్పటికే లింక్ చేయబడిన క్యుఆర్ -కోడెడ్ రిస్ట్‌బ్యాండ్‌లను పొందవచ్చు. 

•       ఈ సౌకర్యం ఉచితం మరియు యాత్రికులు అందరికీ ఇది అందుబాటులో ఉంది.

గత కొద్ది సంవత్సరాలుగా, కేరళ పోలీసులు బాల యాత్రికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను చూశారు, గత సంవత్సరం మొత్తం యాత్రికులలో దాదాపు 10-15% మంది పిల్లలు వున్నారు. అదే సమయంలో, ప్రతి సీజన్‌లో, కేరళ పోలీసులు వందలాది మంది తప్పిపోయిన పిల్లల కేసులను నమోదు చేస్తున్నారు, జనసమూహ నిర్వహణ సమయంలో పిల్లల భద్రత, కీలక సవాలుగా మారుతుంది. 

పతనంతిట్ట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ ఆర్ (ఐపిఎస్) వి సురక్ష కార్యక్రమం కోసం ముందస్తు రిజిస్ట్రేషన్‌ను పతనంతిట్ట జిల్లా పోలీసు కార్యాలయంలో వి, కేరళ బిజినెస్ హెడ్ జార్జ్ మాథ్యూ వి సమక్షంలో అధికారికంగా ప్రారంభించారు. కేరళ వ్యాప్తంగా  ఉన్న 25 వి స్టోర్‌లు మరియు 103 వి మినీ స్టోర్‌లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది, పంబలో 3 వి సురక్ష కియోస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి – వర్చువల్ క్యూ కియోస్క్‌ల పక్కన ఇవి అందుబాటులో ఉన్నాయి.

గత సంవత్సరం, వి 20,000 కి పైగా వి సురక్ష రిస్ట్‌బ్యాండ్‌లను పంపిణీ చేసింది, ఇది కేరళ పోలీసులు యాత్ర సమయంలో తప్పిపోయిన 150 మందికి పైగా పిల్లలను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి సహాయపడింది.

పతనంతిట్ట జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆనంద్ ఆర్ (ఐపిఎస్) మాట్లాడుతూ “వి సురక్ష కార్యక్రమం కింద వి తో ఈ సహకారాన్ని కొనసాగించడం పట్ల జిల్లా పోలీసులు సంతోషంగా ఉన్నారు, ఇది యాత్రికులకు ఎంతో సహాయపడుతుంది. శబరిమల యాత్ర సమయంలో వారి భద్రతను నిర్ధారించడానికి కొనసాగిస్తోన్న మా ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. విడిపోయిన పిల్లలను ట్రాక్ చేయడంలో మరియు వారి కుటుంబాలతో తిరిగి కలవడానికి వి సురక్ష క్యుఆర్ కోడ్ బ్యాండ్‌లు మా ప్రయత్నాలకు గణనీయంగా సహాయపడతాయి” అని అన్నారు. 

ఈ ప్రయత్నాలపై వొడాఫోన్ ఐడియా కేరళ బిజినెస్ హెడ్ జార్జ్ మాథ్యూ వి మాట్లాడుతూ, “వి వద్ద , సురక్షితమైన , తెలివైన కమ్యూనిటీలను సృష్టించడానికి సాంకేతికతను ఉపయోగించడంపై మా దృష్టి కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది భక్తులు శబరిమల యాత్రకు వెళ్తుంటారు.  వారి భద్రతను నిర్ధారించడం చాలా ముఖ్యమైనది. వి సురక్ష  యొక్క వినూత్న క్యుఆర్ కోడ్ బ్యాండ్‌లతో, కుటుంబాలు కనెక్ట్ అయి ఉండవచ్చు మరియు ఏవైనా ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు వారి పిల్లలను త్వరగా గుర్తించవచ్చు. వి సురక్ష కార్యక్రమంపై కేరళ పోలీసులతో మా భాగస్వామ్యం ద్వారా, ఈ తీర్థయాత్రను పిల్లలకు సురక్షితంగా , కుటుంబాలకు ఆందోళన లేకుండా చేయడంలో మరోసారి సహాయం చేయడానికి మేము గర్విస్తున్నాము. నీలక్కల్, పంపా మరియు సన్నిధానం వ్యాప్తంగా మా మెరుగైన నెట్‌వర్క్ భక్తులు వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో కనెక్ట్ అయి ఉండేలా చేస్తుంది”అని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -