- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లు, వారాంతపు సంతల్లో ఏ కూరగాయ అయినా కేజీ రూ.80 నుంచి రూ. 120 పలుకుతోంది. తెలంగాణలో అయితే తోటకూర కిలో రూ.90 వరకు అమ్ముతున్నారు. పాలకూర రేటు రూ.160కి చేరింది. బీర, బెండ, కాకర, క్యాప్సికం, చిక్కుడు, వంకాయ రేట్లు గత 2 నెలలతో పోలిస్తే ఇప్పుడు డబుల్ అయ్యాయి. తుఫాన్ కారణంగా పంట నష్టం, దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.
- Advertisement -



