- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్లోని పెషావర్ పారామిలిటరీ హెడ్క్వార్టర్స్ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు జరిగాయి. పారామిలిటరీ మెయిన్ గేట్ వద్ద పేలుళ్లను ప్రారంభించిన సాయుధులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ దాడులు, కాల్పుల్లో ముగ్గురు కమాండోలు సహా మొత్తం ఆరుగురు మృతిచెందారు. ముగ్గురు సైనికులను కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
- Advertisement -


