నవతెలంగాణ – హైదరాబాద్ : భారతదేశ చేనేత వారసత్వాలను కాపాడటానికి అంకితమైన ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క కార్పొరేట్ సామాజిక సంస్థ ఆద్యం హ్యాండ్వోవెన్, నేడు సాంస్కృతిక అభిరుచి గల ప్రఖ్యాత నటి శోభితా ధూళిపాళను అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు వెల్లడించింది. ‘కల్చర్ బియాండ్ టెక్స్టైల్స్’ అనే ఆద్యం యొక్క అభివృద్ధి చెందుతున్న లక్ష్యంలో కొత్త అధ్యాయాన్ని ఇది సూచిస్తుంది.
ఈ భాగస్వామ్యం గురించి ఆద్యం హ్యాండ్వోవెన్- బిజినెస్ లీడ్ మనీష్ సక్సేన మాట్లాడుతూ, “ఆద్యం ఎల్లప్పుడూ మగ్గం వెనుక ఉన్న వ్యక్తులకు, మన చేతి వృత్తులను రూపొందించే సంస్కృతులకు మరియు అభివృద్ధి చెందుతున్న సంప్రదాయాలకు అండగా నిలుస్తుంది. శోభిత నేటి కాలపు మహిళ, చేనేత వస్త్రాలతో ఆమెకున్న అనుబంధం వ్యక్తిగతమైనది మరియు సహజమైనది. ఆమె మా ప్రచార కర్తగా నిలవటం కొత్త తరం కోసం భారతీయ పనితనంను ప్రతి ఒక్కరూ అభిమానించేలా చేయాలనే మా ప్రయత్నాన్ని పునరుద్ఘాటిస్తుంది” అని అన్నారు.
శోభితా ధూళిపాల తన సంతోషాన్ని వెల్లడిస్తూ “కళ, భావోద్వేగాలను కలిగి ఉంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. ఏదైనా చేతితో తయారు చేసినప్పుడు, అది దానిని సృష్టించిన వ్యక్తి యొక్క ముద్రను కలిగి ఉంటుంది. నేత సంఘాలతో ఆద్యం చేస్తోన్న కృషి, అన్ని రూపాల్లో సంస్కృతిని వేడుక జరుపుకునే సిద్దాంతంతో కలిపి, ఈ అనుబంధాన్ని నాకు చాలా ప్రత్యేకమైనదిగా చేస్తుంది..” అని అన్నారు. ఆద్యం హ్యాండ్వోవెన్ అనేది ఆదిత్య బిర్లా సంస్థకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ, ఇది భారతదేశంలోని నేత సంఘాలతో కలిసి పనిచేస్తోంది, దేశంలోని అత్యుత్తమ చేతివృత్తులకి మద్దతు ఇవ్వడం ద్వారా స్వయం సమృద్ధిగల పర్యావరణ వ్యవస్థను సృష్టించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది.



