- Advertisement -
ఎయిర్ ఫోర్సులో ఉద్యోగం సాధించిన యువకునికి సన్మానం
నవతెలంగాణ – జన్నారం
యువత దేశ సేవ కోసం ముందుకు రావాలని జన్నారం మండలం తపాలాపూర్ సర్పంచ్ మురిమడుగుల కవిత అన్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం సాధించిన గుండ సాయి తేజను మంగళవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో సన్మానించారు. దేశ సేవ చేసేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ యువకులు సత్యనారాయణ రాజన్న మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



