- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్ నుంచి ఎల్వీఎం3-ఎం6 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను ఇది మోసుకెళ్లింది. ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. బ్లూబర్డ్ బ్లాక్-2 మిషన్.. శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్.
- Advertisement -



