Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుబోల్తా పడ్డ కారు.. ముగ్గురు మృతి

బోల్తా పడ్డ కారు.. ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి : పర్యటకులు ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన చీరాల మండలం వాడరేవు మెడికల్ కాలేజీ సమీపంలో మంగళవారం జరిగింది. అందిన వివరాల మేరకు గుంటూరు, తెనాలి ప్రాంతానికి చెందిన 9 మంది యువకులు వాడరేవు సముద్ర స్నానానికి వచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే వాడరేవు మెడికల్ కాలేజీ సమీపంలో చేరుకునేసరికి కారు టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో రోహిత్ నాయక్ (19) అజయ్ (18) అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల గమనించి క్షతగాత్రులను చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ కార్తీక్ (24) అనే మరో యువకుడు మృతి చెందాడు. కాగా మరో ఐదుగురికి గాయాల పాలు కావడంతో ఏరియా వైద్యశాలలో వైద్యులు చికిత్స చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad