- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆమెను గురువారం గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. పార్టీ వర్గాల ప్రకారం, సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
- Advertisement -



