- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు కోల్కతా హైకోర్టులో విచారణకు హాజరయ్యారు. న్యాయవాది గౌను ధరించి ఆమె కోర్టుకు వచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై దాఖలైన కేసు విచారణ కోసం ఆమె నేడు కోర్టుకు హాజరయ్యారు. 15 ఏళ్ల టీఎంసీ పాలన ముగిసిన తర్వాత జరిగిన దాడులు, రాజకీయ ప్రతీకార చర్యలపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి ఆమె స్వయంగా రంగంలోకి దిగడం విశేషం. సీనియర్ నేత కళ్యాణ్ బెనర్జీ కుమారుడు శీర్షణ్య బందోపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది.
- Advertisement -



