- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ పరిధిలో బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల పడవ జూలై 4న మునిగిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. తూర్పు మిడ్నాపూర్ జిల్లా దిఘా హార్బర్ నుంచి జూలై 2న 15 మందితో బయలుదేరిన ఈ బోటు.. ప్రతికూల వాతావరణం, అలల ఉధృతి కారణంగా బక్కాలి కోస్ట్ వద్ద మునిగిపోయింది. రెస్క్యూ బృందాల గాలింపులో ఒడిశా, బెంగాల్కు చెందిన 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో ఆరుగురి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.
- Advertisement -


