- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న 96 వేల కేసుల నేపథ్యంలో, న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించి, కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారడంతో, ఈ చర్య అవసరమైంది.
- Advertisement -



