నవతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్-2026లో భాగంగా కీలక మ్యాచ్లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఆంధ్ర క్రికెటర్ త్రిపురాన విజయ్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేశాడు. అకిబ్ నబీ స్దానంలో విజయ్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఈ మ్యాచ్కు రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో రవి సింగ్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, సాహిల్ పరాఖ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, లుంగీ ఎన్గిడి, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), రవి సింగ్, డోనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, ఆడమ్ మిల్నే, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా
ఆర్సీబీ



