- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే ఎస్ఆర్ హెచ్ vs ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు. మ్యాచ్ అనంతరం అభిమానులకు రవాణా ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉప్పల్, స్టేడియం మెట్రో స్టేషన్లలో భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ముందుగానే రిటర్న్ టికెట్లు, స్మార్ట్ కార్డులు లేదా QR టికెట్లు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని అభిమానులు మెట్రో సేవలను వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
- Advertisement -



