Friday, May 22, 2026
E-PAPER
Homeకరీంనగర్ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ ఆర్‌అండ్‌ఆర్ కాలనీ సమీపంలోని రామప్ప గుట్ట వద్ద విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన హరిచరణ్ గౌడ్(18), ఛీర్లవంచ ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన మణికంఠ(17)గా గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -