- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని హుణమూరు పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. న్యూమారుతి బరంగాయ్కు చెందిన హరీశ్ (49), నిష్ట (36) దంపతులు. వీరికి నిక్షా (12), రక్ష (8) పిల్లలు ఉన్నారు. ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేస్తూ హరీశ్ జీవితం సాధిస్తుంటారు. సోమవారం రాత్రి భార్య, పిల్లలకు ఊపిరాడకుండా చంపి.. అనంతరం హరీశ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా మృతదేహాలు కనిపించాయి. వ్యాపారంలో నష్టాలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.
- Advertisement -



