- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై జైలులో ఉన్న మాజీ జేఎన్యూ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్కు ఢిల్లీ హైకోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆయన తల్లి శస్త్రచికిత్స కారణంగా జూన్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు ఆయన విడుదల కానున్నారు. రూ.1 లక్ష ష్యూరిటీ చెల్లించడంతో పాటు, ఈ మూడు రోజుల్లో ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోర్టు ఆదేశించింది. 2020లో ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టైన ఉమర్ ఖాలిద్, తన నిర్దోషిత్వాన్ని వాదిస్తూ పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు.
- Advertisement -



