Monday, May 25, 2026
E-PAPER
Homeజాతీయంకాక్రోచ్ జ‌న‌త పార్టీ..మ‌రోసారి కిర‌ణ్ రిజిజు కీల‌క వ్యాఖ్య‌లు

కాక్రోచ్ జ‌న‌త పార్టీ..మ‌రోసారి కిర‌ణ్ రిజిజు కీల‌క వ్యాఖ్య‌లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాక్రోచ్ జ‌న‌త పార్టీ అధినేత అభిజిత్‌కు, కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజుకు ఆన్‌లైన్ వేదిక‌గా మాట‌ల యుద్ధం కొన‌సాగిన విష‌యం తెలిసిందే. కాక్రోచ్ మ‌ద్ద‌తుదారులంతా పాక్ చెందిన వార‌ని కేంద్ర‌మంత్రి ఎద్దేవా చేశారు. దానికి అభిజిత్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇండియాకు చెందిన వారే 94శాతం త‌మ‌కు అండ‌గా ఉన్నార‌ని స‌మాధానం ఇచ్చారు. తాజాగా మ‌రోసారి కిర‌ణ్ రిజిజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియాలో ట్రేండ్ అవుతున్న ప్ర‌తి అంశంపై స్పందిచాల్సిన అవ‌స‌రంలేద‌ని, ప్ర‌స్తుతం ముఖ్య విష‌యాల‌పై ఫోక‌స్ చేశామ‌ని సోమ‌వారం అసోం దిబ్రూగఢ్ మీడియా స‌మావేశంలో చెప్పారు.

“మేము ఎంతో కీలకమైన పనిలో నిమగ్నమై ఉన్నాము. ప్రతి విషయానికీ స్పందించడం సబబు కాదు… ఏమీ జరగదు. ఈ దేశాన్ని నడిపించేది ప్రజలే. వారే తమ ఓట్లను వినియోగించుకుని, తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. దేశానికి సేవ చేస్తారు. మేము కీలకమైన అంశాలపై దృష్టి సారిస్తాము తప్ప, ప్రతి విషయంపైనా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -