- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్నారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలోనే ప్రత్యేక విచారణ బృందం బీఆర్ఎస్ అధినేతను ప్రశ్నించనుంది. కాగా ఎర్రవల్లి ఫామ్హౌస్లోనే విచారించాలని కేసీఆర్ చేసిన వినతిని సిట్ తిరస్కరించింది. మరోవైపు కేసీఆర్ సిట్ విచారణకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు, నల్ల జెండాలతో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టనున్నాయి.
- Advertisement -



