2027 మార్చి 31 నాటికి రూ.214 లక్షల కోట్లకు పెరుగుదల
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వంలో అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అప్పులు వెల్లడయ్యాయి. 2026 మార్చి 31 నాటికి రూ.1,97,18,016 కోట్లు అప్పు ఉంటే, 2027 మార్చి 31 నాటికి అది కాస్తా రూ.214,82,050.41 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. అంటే ఏడాదిలోనే రూ.17,64,034 కోట్లు పెరుగుతుందని ప్రభుత్వ బడ్జెట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2019-20లో రూ.1,01,98,173.64 కోట్లుండగా, అది కాస్తా 2026-27 నాటికి రూ.2,14,82,050.41 కోట్లకు పెరుగనుంది. అంటే, ఈ ఎనిమిదేండ్లలో రూ.1,12,83,876.77 కోట్లకు అప్పు పెరగనుంది.




